వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెస్టాఫ్‌ ఇండియాలో గంగూలీకి నోఛాన్స్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: జాతీయ క్రికెట్‌ జట్టులోకి రావాలనే మాజీ కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ ఆశలపై బుధవారం వేటు పడింది. ఇరానీ కప్‌లో తలపడే రెస్టాఫ్‌ ఇండియా జట్టుకు గంగూలీ ఎంపిక కాలేదు. ఫాస్ట్‌ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌కు మాత్రం 14 మంది సభ్యుల రెస్టాఫ్‌ ఇండియా జట్టులో స్థానం లభించింది. రెస్టాఫ్‌ ఇండియాకు ముంబాయి ఓపెనర్‌ వాసిం జాఫర్‌ నాయకత్వం వహిస్తాడు. రెస్టాఫ్‌ ఇండియా జట్టు ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు నాగపూర్‌లో రంజీ ట్రోఫీ ఛాంపియన్‌ ఉత్తరప్రదేశ్‌ జట్టుతో తలపడుతుంది.

హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ వివియస్‌ లక్ష్మణ్‌కు కూడా జట్టులో స్థానం లభించలేదు. గాయంతో బాధపడుతున్న లక్ష్మణ్‌ ఛాలెంజర్‌ ట్రోఫీలో ఆడలేదు. ఛాలెంజర్‌ సిరీస్‌లో ఇండియా గ్రీన్‌ తరఫున ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గంగూలీ వరుసగా 23, 3 పరుగులు చేశాడు. జట్టులోకి తిరిగి రావడానికి గంగూలీకి ఇంకా అవకాశాలున్నాయని సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ అన్నారు. ఛాలెంజర్‌ సిరీస్‌లో ఆడిన ప్రతి ఒక్క క్రీడాకారుడి గురించి చర్చించామని, జోనల్‌ టోర్నమెంట్‌లో ఆడుతున్న గంగూలీ, బాలాజీ, మరికొంత మంది తమ ఆటతీరును బట్టి తిరిగి జట్టులోకి వస్తారని ఆయన అన్నారు. లక్ష్మణ్‌ పేరు కూడా ప్రస్తావనకు వచ్చిందని, అయితే అతను గాయం నుంచి కోలుకొని జోనల్‌ టోర్నమెంట్‌ ఆడిన తర్వాతనే పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X