వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెరాసతో పొత్తు ఇప్పట్లో వుండదు: దత్తాత్రేయ
విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో 2009లో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే విషయంపై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) నుంచి పూర్తిగా బయటికి వచ్చిన తర్వాతనే తెరాసతో పొత్తుపై ఆలోచిస్తామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
కరీంనగర్, బొబ్బిలి లోక్సభలకు జరిగే ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన చెప్పారు. కరీంనగర్లో బిజెపి అభ్యర్థిగా చెన్నమనేని విద్యాసాగర్ రావు పేరు ఖరారైందని ఆయన చెప్పారు. తెరాసతో ఇప్పట్లో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవని ఆయన అన్నారు. 2009 ఎన్నికల్లో పొత్తుకు తెరాస నాయకుడు ఎ. నరేంద్ర ప్రతిపాదన చేశారని ఆయన చెప్పారు.
Comments
Story first published: Wednesday, October 4, 2006, 23:53 [IST]