బోధన్లో ఘర్షణలు: కొనసాగుతున్న ఉద్రిక్తత
నిజామాబాద్: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్లో బుధవారం కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఇరు వర్గాలవారు రాళ్లు రువ్వుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారిపై మంగళవారం రాత్రి ఒక వర్గం వాళ్లు రాళ్లు రువ్వి దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో పోలీసులతో సహా 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటనకు నిరసనగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) బుధవారం జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. జిల్లాలో ఆర్టీసి బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విద్యాసంస్థలను మూసేశారు.
బుధవారం ర్యాలీ తీస్తున్నవారిపై అవతలి వర్గం వారు రాళ్లు రువ్వారు. దీంతో ర్యాలీ తీస్తున్నవారు రాళ్లతో ఎదురుదాడికి దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. పట్టణంలో 144వ సెక్షన్ విధించారు. ఆందోళనకారులు రెండు దుకాణాలకు నిప్పు పెట్టారు. బస్సులను ధ్వంసం చేశారు. పోలీసులు బాష్పవాయువు కూడా ప్రయోగించారు. స్థానిక శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డిని బిజెపి కార్యకర్తలు ఘెరావ్ చేశారు.