వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో ఇద్దరు ఐయస్‌ఐ ఏజెంట్ల అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు గురువారం రాత్రి ఢిల్లీలోని మదన్‌ ఖాదర్‌ ప్రాంతంలో ఇద్దరు ఐయస్‌ఐ ఏజెంట్లను అరెస్టు చేశారు. ఇందులో ఒక ఏజెంట్‌ పాకిస్థాన్‌కు చెందినవాడు కాగా, రెండో ఐయస్‌ఐ ఏజెంటు బంగ్లాదేశ్‌కు చెందినవాడు. తమకు అందిన సమాచారం మేరకు పాకిస్థాన్‌కు చెందిన మొహమ్మద్‌ రజాక్‌ ఖాన్‌ను, బంగ్లాదేశ్‌కు చెందిన అలీ రెహ్మాన్‌ జలాల్‌ను అరెస్టు చేసినట్లు డిసిపి (స్పెషల్‌ సెల్‌) ఆలోక్‌ కుమార్‌ తెలిపారు.

వారి నుంచి ముఖ్యమైన రక్షణ సంబంధమైన పత్రాలను, కంటోన్మెంట్‌ ఏరియాకు చెందిన వర్గీకృత సమాచారాన్ని, స్కెచ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. వారికి సంబంధించిన డైరీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X