వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లక్ష్మయ్య, ప్రతాపరెడ్డి మాటకు మాట
వరంగల్: ప్రోటోకాల్ వ్యవహారంపై వరంగల్ జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కొమ్మూరి ప్రతాపరెడ్డికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దేవాదుల పైపులైన్ నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేసే విషయంలో ఈ వివాదం చెలరేగింది. ఇరువురు మాటా మాటా అనుకున్నారు.
చెక్కుల పంపిణీని అడ్డుకుని మంత్రి లక్ష్మయ్య రాజకీయం చేయవద్దని ప్రతారెడ్డి అన్నారు. దీనికి ప్రతిగా - చెక్కులన్నీ శాసనసభ్యుడే పంపిణీ చేస్తారా, ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదా? అని లక్ష్మయ్య అన్నారు. దీనికి ప్రతాపరెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. ఇరువురు వాగ్వివాదానికి దిగారు. ఈ సమయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఎం. సత్యనారాయణరావు, మరో మంత్రి రెడ్యా నాయక్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
Comments
Story first published: Friday, October 6, 2006, 23:53 [IST]