వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అఫ్జల్ కు క్షమాభిక్ష వద్దు: బిజెపి
న్యూఢిల్లీ: అఫ్జల్కు క్షమాభిక్ష ప్రసాదించవద్దంటూ బిజెపి నాయకులు ఆదివారం రాష్ట్రపతి అబ్దుల్ కలాంను కలవనున్నారు. బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, సీనియర్ నేత ఎల్కె అద్వానీ నేతృత్వంలోని పార్టీ బృందం రేపు కలాంను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకుంది. మహ్మద్ అఫ్జల్కు మరణశిక్ష విధించితీరాలని రాజ్నాథ్ సింగ్ అన్నారు. అఫ్జల్కు ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమాభిక్ష ప్రసాదించవద్దని తాము రాష్ట్రపతిని కోరతామని ఆయన చెప్పారు. దీనిపై రాష్ట్రపతికి మెమొరాండం అందజేస్తామని రాజ్నాథ్ తెలిపారు. 2001లో పార్లమెంట్పై దాడి కేసులో మహ్మద్ అఫ్జల్కు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే అఫ్జల్కు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ విజ్ఞపులు వస్తున్నాయి.
Comments
Story first published: Saturday, October 7, 2006, 23:53 [IST]