వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీయే అలసత్వం వల్లనే నక్సల్స్‌ సమస్య: కారత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

రాంచీ: నక్సల్స్‌ అణిచివేతకు పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి జార్ఖండ్‌ రాష్ట్రంలో ఇంతకుముందు పనిచేసిన ఎన్డీఎ సర్కారు సహకరంచలేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ శనివారం ఆరోపించారు. దీని ఫలితంగా నక్సల్స్‌ పశ్చిమబెంగాల్‌లో హింసకు పాల్పడి తిరిగి జార్ఖండ్‌కు చేరుకుంటున్నారని ఆమె విలేకరులతో అన్నారు.

పశ్చిమబెంగాల్‌లో నక్సల్స్‌ హింసకు జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి అర్జున్‌ ముండాదే బాధ్యత న్నారు. జార్ఖండ్‌లో ఎన్డీఎ సర్కారు పతనాన్ని తమ పార్టీతో పాటు అన్ని పార్టీలు స్వాగతించాయని ఆమె చెప్పారు. ముండా ప్రభుత్వ హయంలో అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు. ముండా ప్రభుత్వ పతనంతో సామాన్య ప్రజలకు ఉపశమనం లభించిందని అన్నారు. రాష్ట్రంలో సుసిర్థమైన ప్రభుత్వం ఏర్పాడాలంటే మధ్యంతర ఎన్నికలే శరణ్యమని ఆమె అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X