వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖ జిల్లాలో ఎన్కౌంటర్: మావోయిస్టు నేత మృతి
విశాఖపట్నం: విశాఖ జిల్లా జీకె వీధి మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రముఖ మావోయిస్టు కడారి రాములు మరణించినట్టు పోలీసులు ప్రాధమిక సమాచారం. రాములు గుర్తేడు దళం డిప్యూటీ కమాండర్ అని పోలీసులు భావిస్తున్నారు. నిన్న కొయ్యూరు మండలం ల్యాండ్మైన్ పేలిన సంఘటనలో ఒక కానిస్టేబుల్కు గాయాలు కావడంతో పోలీసులు ఆ ప్రాంతంలో మమ్మర గాలింపు చర్యలు చేపట్టడంతో రాములు దొరికిపోయాడు.
దార్లగొంది వద్ద గుర్తేడు దళం ఎదురు కావడంతో శనివారం ఉదయం పదిన్నరకు పోలీసులు కాల్పులు జరిపారు. ఇరువర్గాలకు మధ్య జరిగిన కాల్పుల్లో రాములు మరణించినట్టు తెలుస్తోంది. సంఘటన స్ధలంలో నక్సల్స్కు చెందిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
Comments
Story first published: Saturday, October 7, 2006, 23:53 [IST]