వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైకమాండ్ ఆదేశిస్తే కరీంనగర్లో పోటీ: ఎమ్మెస్
విశాఖపట్నం: కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆదే శిస్తే కరీంగనర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తానని రాష్ట్ర సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి ఎం. సత్యనారాయణరావు అన్నారు. శనివారం విశాఖపట్టణం జిల్లా పర్యటనకు వచ్చిన ఎమ్మెస్ విలేకరులతో మాట్లాడారు. కెసిఆర్పై పోటీ చేయమని అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ఎమ్మెస్ అన్నారు.
52 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని ఆయన అన్నారు. పోటీలో గెలుపు ఓటములు సహజమన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, టిఆర్ఎస్కు తాను వ్యతిరేకం కాద న్నారు. తాను టిఆర్ ఎస్ కండువాతో గెలిచానని కెసిఆర్ అనడంతోనే సవాల్ చేశానని ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, October 7, 2006, 23:53 [IST]