వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శక్తివేల్ కొత్త పార్టీ పీపుల్స్ కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ: దేశంలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. మాజీ కాంగ్రెస్ నాయకుడు కె. శక్తివేల్ పీపుల్స్ కాన్పెరెన్స్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. తమ పార్టీని ఆమోదిస్తూ ఎన్నికల సంఘం రిజిస్ట్రేషన్ చేసిందని శక్తివేల్ శనివారం విలేకరులతో చెప్పారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన అన్నారు. తమకు మంచి ఫలితాలు లభిస్తాయని శక్తివేల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతుందని శక్తివేల్ తెలిపారు.
Story first published: Saturday, October 7, 2006, 23:53 [IST]