వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీసి సమ్మెను నివారిస్తాం: కన్నా లక్ష్మినారాయణ

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆర్టీసి కార్మికుల సమ్మె జరగకుండా చూస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. కార్మికుల సమ్మె వల్ల ఆర్టీసికి నష్టమే తప్ప లాభం ఏదీ ఉండదని ఆయన అన్నారు. విశాఖపట్నం ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటయిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో కార్మికుల సమ్మె జరిగినప్పుడు ఆర్టీసికి 50 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు.

ఆర్టీసిని లాభాల్లో నడిపించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ద్వారా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టీసి యాజమాన్యం, కార్మిక సంఘాలు చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. నిరర్ధకమైన ఆర్టీసి భూములను లీజుకు ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకోలేదని, 2002లో బోర్డు ఆ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X