వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిజామాబాద్ జిల్లాలో మావోయిస్టుల డంప్ స్వాధీనం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కలికోట గ్రామం వద్ద పోలీసులు మావోయిస్టులకు చెందిన ఎనిమిది క్లేమోర్ మైన్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో తెలుగుదేశం పార్టీకి చెందిన రామడుగు యంపిటిసి సుబేందర్ ఉన్నాడు. మావోయిస్టులకు చెందిన ఎనిమిది బకెట్ బాంబులను, ఎనిమిది డిటొనేటర్లను, రెండు మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాము స్వాధీనం చేసుకున్న డంప్లను నిజామాబాద్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ ఆదివారంనాడు మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రదర్శించారు. పంచాయతీ ఎన్నికల సమయంలో మావోయిస్టులు జక్రాన్పల్లి ఎమ్మార్వో కార్యాలయాన్ని, వైశ్యా బ్యాంక్ను పేల్చివేడాయినికి కుట్ర పన్నారని, అయితే అది సాధ్యం కాలేదని ఆయన చెప్పారు.
Comments
Story first published: Sunday, October 8, 2006, 23:53 [IST]