వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరీంనగర్ ఎన్నిక ఎవరికీ లాభం చేయదు: సిపిఐ
హైదరాబాద్: కరీంనగర్ ఉప ఎన్నిక వల్ల ఎవరికీ లాభం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి, నల్లగొండ లోక్సభ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు వాడుతున్న పదజాలం జుగుప్సాకరంగా వుందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ పార్టీల నాయకులు వాడుతున్న భాష దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన అన్నారు.
కాంగ్రెస్, తెరాస నాయకుల వ్యక్తిగత విమర్శలు, రెచ్చగొట్టే మాటలు రాజకీయ విలువల దిగుజారుడుకు అద్దం పడుతున్నాయని ఆయన అన్నారు. ఆ విధమైన మాటల వల్ల ఓటర్లకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ప్రజలు చైతన్యం పొందారని, రాజకీయ పరిజ్ఞానం సంతరించుకున్నారని, అందువల్ల రాజకీయ పార్టీలు విమర్శలు జాగ్రత్తగా చేసుకోవాల్సి వుంటుందని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, October 8, 2006, 23:53 [IST]