వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డెంగీ రోగులను పరామర్శించిన ప్రధాని

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో చికిత్స పొందుతున్న డెంగీ రోగులను ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఆదివారంనాడు పరామర్శించారు. ఢిల్లీలో డెంగీ వ్యాధుల కేసుల 886కు పెరిగాయి. గత 24 గంటల్లో డెంగీ వ్యాధితో ఢిల్లీలో 21 మంది మరణించారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు మనవళ్లను, అల్లుడ్ని కూడా ప్రధాని పరామర్శించారు. ప్రధాని దాదాపు 30, 40 మంది రోగులను పరామర్శించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఎయిమ్స్‌లో ప్రధాని గంటకు పైగా ఉన్నారు. డెంగీ వ్యాధికి చికిత్స అందించేందుకు గల సౌకర్యాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. డెంగీ వ్యాధితో గత బుధవారం ఎయిమ్స్‌లో చేరిన ప్రధాని మనవడు రోహన్‌ ఆదివారంనాడు డిశ్చార్జి అయ్యాడు. ప్రధాని మరో మనవడు మాధవ్‌ను, అల్లున్ని కొద్ది రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారు. బీహార్‌కు చెందిన పార్లమెంటు సభ్యులు రాజీవ్‌ రంజన్‌, వీరేందర్‌ మాలిక్‌లు కూడా డెంగీ వ్యాధితో ఎయిమ్స్‌లో చేరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X