వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌లో దేశంలోనే తొలి రోబోట్‌ సర్జరీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని వైద్య విజ్ఞాన సంస్థ కేర్‌ భారతదేశంలోనే తొలి రోబోట్‌ సహాయంతో హృద్రోగ చికిత్స నిర్వహించింది. దీన్ని రోబోట్‌ సాయంతో నిర్వహించిన మిట్రాల్‌ వాల్వ్‌ రిప్లేస్‌మెంట్‌ అంటారు. రోబోట్‌ సహాయం చేసే శస్త్రచికిత్స సంప్రదాయ శస్త్రచికిత్స కన్నా ఉత్తమమైందని కార్డియో థొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ రవికుమార్‌ అన్నారు.

రోబోటిక్‌ సర్జరీ వల్ల ఇన్‌ఫెక్షన్‌ అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆయన చెప్పారు. సంప్రదాయ శస్త్రచికిత్సలో మాదిరిగా స్టెర్నమ్‌ను కట్‌ చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఈ పరికరం ధరం దాదాపు ఏడు కోట్ల రూపాయలని, ఇతర హృద్రోగ శస్త్రచికిత్సలకు, యూరోలాజికల్‌ డిజార్డర్స్‌కు, గైనకాలిజికల్‌ చికిత్సలకు కూడా దీన్ని వాడవచ్చునని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు కేర్‌లో నలుగురు రోగులకు రోబోటిక్‌ సర్జరీ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X