వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బియస్పీ వ్యవస్థాపక నేత కాన్షీరామ్‌ కన్నుమూత

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బహుజన సమాజ్‌ పార్టీ (బియస్పీ) వ్యవస్థాపక నేత కాన్షీరామ్‌ సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. దీర్ఘకాలంగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. సుదీర్ఘ కాలంలో ఆస్పత్రులో చికిత్స పొందిన ఆయన కొంత కాలంగా హుమాయున్‌ రోడ్డులోని తన నివాసంలో వుంటున్నారు. ఇక్కడే ఆయన కన్నుమూశారు. తుది శ్వాస విడిచే సమయంలో కాన్షీరామ్‌కు సమీపంలోనే బియస్పీ నేత మాయావతి ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కుటంబ సభ్యులెవరూ ఆయనతో ఉండడం లేదు.

కాన్షీరామ్‌ అంత్యక్రియలు నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో ఈ సాయంత్ర నాలుగు గంటలకు జరుగుతాయని మాయావతి చెప్పారు. దళితుల హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన నేతగా మాయావతి కాన్షీరామ్‌ను అభివర్ణించారు. మనువాది శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు, ఆత్మగౌరవంతో జీవనాన్ని సాగించేందుకు దళితులను చైతన్యవంతులను చేసిన నేత అని ఆమె ప్రశంసించారు. కాన్షీరామ్‌ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి దళితుల కోసం పోరాడారు. దళిత బహుజనులు రాజ్యాధికారం సంపాదించుకోవాలనే నినాదాన్ని సాకారం చేయడానికి ఆయన బహుజన సమాజ్‌ పార్టీని స్థాపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X