వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 800 కోట్లతో వాటర్‌షెడ్లు: రఘువీరా

By Staff
|
Google Oneindia TeluguNews

మెదక్‌: రాష్ట్రంలో 800 కోట్ల రూపాయలతో వాటర్‌షెడ్లను ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి ఎన్‌. రఘువీరా రెడ్డి ప్రకటించారు. కానుగచెట్ల పెంపకానికి రాష్ట్రంలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. బయోడీజిల్‌ తయారీకి ఉపయోగపడే కానుగచెట్లను పెంచే చిన్న, సన్నకారు రైతులకు రాయితీతో రుణాలు కల్పించనున్నట్లు ఆయన చెప్పారు.

రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా కానుగచెట్ల పెంపకాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. బిల్లులు ఉండి నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులకు వందశాతం నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన చెప్పారు.ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో లక్ష ఎకరాల్లో కానుగ చెట్లను పెంచనున్నట్లు ఆయన తెలిపారు. జెట్రోపాకు బదులు ఇక కానుగ చెట్లనే పెంచాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X