వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
చిత్తూరు: చిత్తూరు జిల్లా కలికడ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఆరుగురిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేర్చారు. మృతుల్లో ఒకరు గిద్దలూరుకు చెందిన టమోటా వ్యాపారి తిరుపతయ్య కాగా, మిగతా ఐదుగురు కలిగిరి మండలానికి చెందిన కూలీలు. జాతీయ రహదారిపై ఆగి వున్న లారీని జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో బాషా, విజయకుమార్, రెడ్డిబాషా ఉన్నారు.
Story first published: Wednesday, October 11, 2006, 23:53 [IST]