భారత రచయిత్రి కిరణ్కు బుకర్ ప్రైజ్
లండన్: సాహిత్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైస బుకర్ ప్రైజ్ భారత రచయిత్రి కిరణ్ దేశాయ్ని వరించింది. ఈ ప్రైజ్ పొందిన భారత రచయితల్లో 35 ఏళ్ల కిరణ్ దేశాయ్ పిన్న వయస్కురాలు. ఆమె తల్లి అనితాదేశాయ్ కూడా రచయిత్రే. బుకర్ ప్రైజ్ కోసం అనితాదేశాయ్ పేరు మూడు సార్లు షార్ట్ లిస్టు అయింది. అయితే దాన్ని పొందడంలో ఆమె విఫలమైంది. ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే నవలకు కిరణ్ దేశాయ్కు ఈ అవార్డు లభిచంంది. ఈ పుస్తకం తనదెంతనో తన తల్లిది కూడా అంతేనని కిరణ్ దేశాయ్ అన్నారు.
నవలను రాయడంలో తన తల్లి సాహచర్యం, జ్ఞానం, దయ తనకు ఉపయోగపడ్డాయని ఆమె కొనియాడారు. మానవతా విస్తృతికి, విజ్ఞానానికి అద్దం పట్టని నవల అద్భుతమని న్యాయనిర్ణేతల చైర్పర్సన్ హెర్మొయిన్ లీ ప్రశంసించారు. అతి చిన్న వయస్సులో ఈ అవార్డును ఇంతకు ముందు భారత రచయిత్రి అరుంధతీరాయ్ 1997లో అందుకున్నారు. ఇప్పుడు అంతకన్నా చిన్న వయస్సులో కిరణ్ను ఈ అవార్డు వరించింది. బెన్ ఓక్రి 32 ఏళ్ల వయస్సులోనే బుకర్ ప్రైజ్ను పొందారు. కిరణ్ భారత్, ఇంగ్లాండు, అమెరికాల్లో విద్యనభ్యసించారు. ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే నవలను రాయడానికి కిరణ్కు ఎనిమిదేళ్లు పట్టింది.