నక్సల్ సంజీవ్ ఎన్కౌంటర్: బూటకమని ఆందోళన
మెదక్: మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల క్రాస్ రోడ్డు వద్ద బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఒక నక్సలైట్ మరణించాడు. మరణించిన నక్సలైట్ను జనశక్తి రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతూరు నాగభూషణం అలియాస్ కిరణ్గా గుర్తించారు. వాహనాలను తనిఖీ చేస్తుండగా మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆపకుండా తమపై కాల్పులు జరిపారని, దాంతో తాము ఎదురు కాల్పులు జరిపామని, ఈ ఎదురుకాల్పుల్లో నాగభూషణం మరణించాడని పోలీసులు చెప్పారు.
మిగతా నక్సల్స్ నెంబరు లేని మోటార్ సైకిల్పై పారిపోయారని పోలీసులు చెప్పారు. అయితే నాగభూషణాన్ని పట్టుకుని చిత్రహింసలు పెట్టి పోలీసులు కాల్చి చంపారని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణతో వారు అందోళనకు దిగారు. నాగభూషణం మృతదేహాన్ని బంధువుల నుంచి పోలీసులు బలవంతంగా లాక్కున్నారు. దీంతో ఆగ్రహించిన నాగభూషణ బంధువులు అదనపు యస్పీ వాహనానికి అడ్డం పడ్డారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు.