వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
తిరుపతి: తిరుపతి - చెన్నై జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న లారీని ప్రయాణికులతో ఉన్న జీపు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులు జీపులో తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుని తిరిగి వెళ్తున్నారు.
తిరుపతి నుంచి వెళ్తున్న ఈ జీపు చెన్నై వస్తున్న లారీని పుత్తూరు సమీపంలో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు అనంతపురం జిల్లాకు చెందినవారు కాగా ఒకరు పుత్తూరు మండలం రాచపాలెం గ్రామానికి చెందినవారు.
Comments
Story first published: Thursday, October 12, 2006, 23:53 [IST]