వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
1993 పేలుళ్లు: మరో 4గురు దోషులు
ముంబాయి: 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో టాడా కోర్టు గురువారంనాడు మరో నలుగురిని దోషులుగా నిర్ధారించింది. బాంబు పేలుళ్లకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కున్న నలుగురిని టాడా కోర్టు దోషులుగా నిర్ధారించింది. సాక్ష్యాలు లభించకపోవడంతో ఒక నిందితుడ్ని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.
మొహమ్మద్ ఎతెషామ్, షా నవాజ్ ఖాన్, షెరీఫ్ ఖాన్ అధికారి, సుజ్జాద్ ఆలంలు కోర్టు దోషులుగా నిర్ధారించినవారిలో వున్నారు. రాయఘడ్లోని షెఖాడిలో ఆయుధాలను, పేలుడు పదార్థాలను ఉంచినందుకు వారిని కోర్టులు దోషులుగా ప్రకటించింది. అషాక్ కాసిం హవల్దార్ అనే నిందితుడు నిర్దోషిగా బయటపడ్డాడు. ఆ నలుగురిని కస్టడీలోకి తీసుకున్నారు. వారి బెయిల్ బాండ్లు రద్దు చేశారు.
Comments
Story first published: Thursday, October 12, 2006, 23:53 [IST]