వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్తో ఎమ్యెల్యే గౌరు చరితారెడ్డి భేటీ
హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభ్యురాలు గౌరు చరితా రెడ్డి గురువారం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. తన భర్త గౌరు వెంకటరెడ్డికి పెట్టిన క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడారు.
క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నుంచి తమకు ఉత్తర్వులు ఇంకా రాలేదని ఆమె ముఖ్యమంత్రికి తెలిపినట్లు సమాచారం. అదే విధంగా వెంకటరెడ్డికి పెట్టిన క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో గల న్యాయపరమైన విషయాల గురించి కూడా ఆమె రాజశేఖరరెడ్డితో మాట్లాడినట్లు చెబుతున్నారు.
Comments
Story first published: Thursday, October 12, 2006, 23:53 [IST]