వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాతబస్తీకి రూ. 2 వేల కోట్ల ప్యాకేజీ: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పాతబస్తీ అభివృద్ధికి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి 2 వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. పాతబస్తీలో ఆయన గురువారంనాడు ఆకస్మికంగా పర్యటించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న డెంగ్యూ రోగులను కూడా ఆయన పరామర్శించారు. డ్రైనేజీ వ్యవస్థ బాగా లేదని పాతబస్తీ వాసులు చాలా మంది ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.

పాతబస్తీలో సీవరేజీ వ్యవస్థను బాగు చేయడానికి నిధులు కేటాయిస్తామని ఆయన చెప్పారు. వందకోట్ల రూపాయల వ్యయంతో మంచినీటి సౌకర్యం కల్పిస్తామని, 13.5 కోట్ల రూపాయలతో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పారిశుధ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఐదు గంటల పాటు సాగిన పాతబస్తీ పర్యటనలో ఆయన వెంట శాసనసభ్యులు, ఉన్నతాధికారులు ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X