వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రభుత్వంతో యన్యంయు నేతల చర్చలు
హైదరాబాద్: ఆర్టీసి కార్మికుల సమ్మె విషయంలో నేషనల్ మజ్జూర్ యూనియన్ (యన్యంయు) నాయకులను రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ నెల 18వ తేదీ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగడానికి వీలుగా ఆర్టీసి కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్మిక సంఘం నాయకులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది.
రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ కార్యాలయం నుంచి యన్యంయు నాయకులకు ఈ మేరకు ఫోన్ కాల్ అందింది. ఈ చర్చల్లో మంత్రితో పాటు బదిలీ అయి ఛండీఘర్ వెళ్తున్న ఆర్టీసి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణారావుతో పాటు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన దినేష్ రెడ్డి పాల్గొంటున్నారు. వేతన సవరణనే ఈ చర్చల్లో ప్రధానాంశం అవుతుంది.
Comments
Story first published: Thursday, October 12, 2006, 23:53 [IST]