వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జస్టిస్ చలపతి ముందు హాజరు కానున్న చంద్రబాబు
హైదరాబాద్: కుప్పం ప్రాజెక్టు వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఈ నెల 18న జస్టిస్ పిబికె చలపతి ఏకసభ్య కమిషన్ ఎదుట విచారణ నిమిత్తం హాజరు కానున్నారు. ఈ వ్యవహారం మొత్తంలో కీలకంగా వ్యవహరించిన ఇజ్రాయెల్ కన్సల్టెంట్ భోజరాంను కూడా విచారించడానికి నెలక్రితమే సమన్లు జారీ చేయగా ఆయన ఇంతవరకు హాజరు కాలేదు.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న భోజరాంను ఆరెస్టు చేసి తీసుకురావాల్సిందిగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్కు జస్టిస్ చలపతి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుకు కూడా సమన్లు జారీ కాగా ఆయన ఇంతవరకు హాజరు కాలేదు. దీనితో ఆయనకు కూడా వారెంట్లు జారీచేసినట్టు తెలుస్తోంది.
Comments
Story first published: Friday, October 13, 2006, 23:53 [IST]