వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గౌరు విషయంలో పోలీసులను సమర్ధించిన డిజిపి
హైదరాబాద్: గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష పెట్టాలని సిఫార్సు చేయడంలో తమ పోలీసు శాఖ పూర్తి పారదర్శకంగా వ్యవహరించిందని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ స్వరణ్జిత్ సేన్ శుక్రవారం ఇక్కడ చెప్పారు. వెంకటరెడ్డి విషయంలో కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీ న్యాయబద్ధంగా నివేదికలు ఇవ్వలేదని సుప్రీంకోర్టు తప్పు పట్టిన విషయం తెలిసిందే.
వెంకటరెడ్డి విషయంలో న్యాయ వ్యవస్ధ తన పని తాను చేసుకుపోయిందని, కోర్టు తీర్పుపై తాను వ్యాఖ్యానించలేనని ఆయన అన్నారు. నిన్న గౌరు వెంకటరెడ్డి కుటుంబం నుంచి ఒక లేఖ తమ కార్యాలయానికి చేరిందని, ఆయనను ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చన్నది ఆ లేఖ సారాంశమని డిజిపి చెప్పారు. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు అందలేదని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాము నడుచుకుంటామని ఆయన వివరించారు.
Comments
Story first published: Friday, October 13, 2006, 23:53 [IST]