వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రింగ్‌రోడ్డుపై కేశవరావు ఛలోక్తులు, సవాళ్ళు

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: రింగ్‌రోడ్డు విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పిసిసి అధ్యక్షుడు కే కేశవరావు తనదైన శైలిలో ఖండించారు. రింగ్‌రోడ్డును భూము మీదే నిర్మిస్తారు గానీ ఆకాశంలో నిర్మించరని ఆయన ఛమత్కరించారు. సమాచార హక్కుపై జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విశాఖ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రింగ్‌రోడ్డుపై ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు కోరితే వారి బంధువులతోనైనా విచార ణ జరిపించేందుకు సిద్ధమని ఆయన అన్నారు. శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఏ అభ్యర్ధినీ సమర్ధించడం లేదని చెప్పారు. సమాచార హక్కుపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, త్వరలో ఇది ప్రజల చేతుల్లో బ్రహ్మాస్త్రంగా మారనుందని కేశవరావు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X