వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రింగ్రోడ్డుపై కేశవరావు ఛలోక్తులు, సవాళ్ళు
విశాఖపట్నం: రింగ్రోడ్డు విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పిసిసి అధ్యక్షుడు కే కేశవరావు తనదైన శైలిలో ఖండించారు. రింగ్రోడ్డును భూము మీదే నిర్మిస్తారు గానీ ఆకాశంలో నిర్మించరని ఆయన ఛమత్కరించారు. సమాచార హక్కుపై జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విశాఖ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రింగ్రోడ్డుపై ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు కోరితే వారి బంధువులతోనైనా విచార ణ జరిపించేందుకు సిద్ధమని ఆయన అన్నారు. శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్ధినీ సమర్ధించడం లేదని చెప్పారు. సమాచార హక్కుపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, త్వరలో ఇది ప్రజల చేతుల్లో బ్రహ్మాస్త్రంగా మారనుందని కేశవరావు తెలిపారు.
Comments
Story first published: Friday, October 13, 2006, 23:53 [IST]