వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నెల్లూరు జిల్లా తడకు మహర్దశ: కేంద్రం అంగీకారం
న్యూఢిల్లీ: నెల్లూరు జిల్లా తడలో 600 ఎకరాల ప్రదేశంలో ప్రత్యేక ఆర్ధిక మండలిని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇక్కడ పాద రక్షల తయారీ పరిశ్రమలను నెలకొల్పనున్నట్టు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఇంత పెద్ద పాద రక్షల తయారీ పరిశ్రమలు ఇంతవరకు ఏర్పాటు కాలేదని, ఈ ప్రాజెక్టు ద్వారా మొదటి దశలోనే ఐదు వేల మంది స్ధానిక కార్మికులకు ఉపాధి కలుగుతుందని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి జైరాం రమేష్ శుక్రవారం ఢిల్లీలో ప్రకటించారు. ఈ పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్ధ, టాటా కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తాయని ఆయన చెప్పారు. ఏటా 4,500 కోట్ల విలువైన పాదరక్షలను ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేయవచ్చని అంచనా వేసినట్టు ఆయన చెప్పారు.
Comments
Story first published: Friday, October 13, 2006, 23:53 [IST]