వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
16న కలెక్టరేట్ల ముట్టడి: టిడిపి నిర్ణయం
హైదరాబాద్: గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసి, అక్రమాలకు పాల్పడిన వారికి అక్షింతలు వేసిన నేపధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలను ఉదృతం చేయాలని తెలుగుదేశం నిర్ణయించింది. శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో జరిగిన టిడిపి పోలిట్బ్యూరో సమావేశంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ పిలుపు ఇచ్చారు. 16న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ప్రదర్శనలు నిర్వహించాలని ఆయన టిడిపి శ్రేణులకు పిలుపు ఇచ్చారు.
గౌరు వెంకటరెడ్డి ఉదంతంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో మరింత వ్యతిరేకత ఏర్పడిందని, ఇదే అదనుగా టిడిపి ఉద్యమాలను ఉధృతం చేయాలని ఆయన కోరారు. ఇలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న టిడిపి కార్యకర్తలను నెల్లూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Story first published: Friday, October 13, 2006, 23:53 [IST]