వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫ్యాబ్సిటీ పనులను వేగ వంతం చేయండి: వైఎస్
హైదరాబాద్: ఫ్యాబ్సిటీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యాబ్సిటీ పనులపై ఆయన శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్దాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భారీ పరిశ్రమల మంత్రి గీతారెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఫ్యాబ్సిటీ తరఫున ఒక ప్రతినిధి హాజరయ్యారు. కేంద్ర వాణిజ్య శాఖ ఇటీవల ఫ్యాబ్సిటీకి అనుమతి ఇచ్చినందువల్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం వారం రోజుల్లో టెండర్లను ఆహ్వానిస్తామని కంపెనీ ప్రతినిధి హామీ ఇచ్చారు.
Comments
Story first published: Friday, October 13, 2006, 23:53 [IST]