వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్షమాభిక్ష వెనుక వైఎస్ జోక్యం ఉంది: చంద్రబాబు
హైదరాబాద్: ఒక హత్య కేసులో శిక్ష పడిన కాంగ్రెస్ నాయకుడు గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష ప్రసాదించడంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ జోక్యం ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఇక్కడ మీడియా సమావేశంలో ఆరోపించారు. గౌరు వెంకటరెడ్డికి అక్రమంగా క్షమాభిక్ష పెట్టడంపై సుప్రీకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టిందని, అటువంటప్పుడు రాజశేఖరరెడ్డి ఎలా తప్పించుకోగలరని ఆయన ప్రశ్నించారు. తనకు రోజూ 500 పైగా ఫైళ్ళు వస్తాయని, వెంకటరెడ్డి క్షమాభిక్ష ఫైలును చదవకుండా సంతకం చేశానని ముఖ్యమంత్రి వైఎస్ చెప్పడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. గౌరు క్షమాభిక్ష కేసులో జరిగిన అక్రమాలన్నీ ముఖ్యమంత్రికి ముందే తెలుసని ఆయన ఆరోపించారు.
Comments
Story first published: Saturday, October 14, 2006, 23:53 [IST]