వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఢిల్లీని వణికిస్తున్న డెంగీ: మృతుల సంఖ్య 25
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో డెంగీ వ్యాధితో మరణించిన వారి సంఖ్య శనివారం 25 కు పెరిగింది. ఈ వ్యాధితో ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య 1373 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే ఢిల్లీలో డెంగీ వ్యాధి గ్రస్తుల సంఖ్య 95 కేసులు నమోదైనట్టు డాక్టర్లు చెప్పారు. ఈ వ్యాధితో ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో గత 24 గంటల్లో 39 మంది కొత్త పేషెంట్లు చేరినట్టు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. ఈ వ్యాధి సోకిందన్న అనుమానంతో ఎయిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో రోజుకు సగటున వెయ్యి మందికి పరీక్షలు చేస్తున్నారు.
Comments
Story first published: Saturday, October 14, 2006, 23:53 [IST]