వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్న లాలూ: బండారు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వేను ఆ శాఖ మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నిర్లక్ష్యం చేస్తున్నారని, బిజెపి నాయకుడు రైల్వేశాఖ మాజీ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ శనివారం ఇక్కడ ఆరోపించారు. లాలూ కేవలం బీహారుకు మాత్రమే రైల్వే మంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. నేడు హైదరాబాద్‌కు వచ్చిన లాలూకు బండారు బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వే పథకాలు లేకుండా చేశారన్నారు. తాను మంత్రిగా ఉండగా రాష్ట్రానికి కేటాయించిన పథకాలకు కూడా లాలూ నిధులు ఇవ్వడం లేదని దత్తాత్రేయ ఆరోపించారు. హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X