నేదురుమల్లి అభ్యర్ధనను తిరస్కరించిన లాలూ
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ విశాఖ కాంగ్రెస్ నాయకులకు నిరాశే మిగిల్చారు. వాల్తేరు డివిజన్ను దక్షిణ మధ్య రైల్వేలో విలీనం చేయాలని విశాఖపట్నం ఎంపీ నేదురుమల్లి జనార్ధనరెడ్డి అభ్యర్ధించగా అందుకు లాలూ సున్నితంగా తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు వేల కోట్లతో 24 రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని ఆయన చెప్పారు. త్వరలో చెన్నై నుంచి ఢిల్లీకి ఒక రైలు సర్వీసును ప్రవేశపెట్టనున్నామని, ఆ రైలు ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణిస్తుందని లాలూ చెప్పారు. విశాఖపట్నంలో లాలూ ప్రసాద్ యాదవ్ను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఆయనకు కిరీటం పెట్టి, పిల్లనగ్రోవి అందించారు. శ్రీకృష్ణుడి ప్రతిమను బహూకరించారు. నేటి సాయంతం లాలూ ప్రసాద్ సికింద్రాబాద్లో జరిగే దక్షిణ మధ్య రైల్వే రూబీ ఉత్సవాల్లో పాల్గొంటారు.