వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైఎస్ తప్పు ఒప్పుకుని చెంపలేసుకోవాలి: వెంకయ్య
నెల్లూరు: గౌరు వెంకటరెడ్డి క్షమాభిక్ష విషయంలో రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పును ఒప్పుకుని చెంపలు వేసుకోవాలని బిజెపి అగ్ర నాయకుడు ఎం వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. గౌరు క్షమాభిక్ష విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడంపై ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. చేసిన తప్పును ఒప్పుకోవాలే గానీ గత తెలుగుదేశం ప్రభుత్వం కూడా అనేక మంది ఖైదీలను విడుదల చేసిందని చెప్పడం సమంజసం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు అయిన తర్వాత తెలుగుదేశం హయాంలో జరిగిన తప్పులను వెలికి తీయడం విడ్డూరమని వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగుదేశంను తాము వెనుకేసుకు రావడం లేదని, ఆ పార్టీతోఒ తమకు ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, October 14, 2006, 23:53 [IST]