వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎటువంటి చర్యలనైనా ఎదుర్కుంటా: జయలలిత
చెన్నై: డియంకె ప్రభుత్వం తనపై ఎటువంటి చర్యలు తీసుకున్నా అందుకు తాను సిద్ధంగానే వున్నానని అన్నాడియంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత అన్నారు. స్థానిక సంస్థలకు జరిగిన మొదటి దశ ఎన్నికల్లో హింసను ప్రోత్సహించినందుకు జయలలితపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కరుణానిధి చేసిన ప్రకటనకు ప్రతిస్పందిస్తూ ఆమె ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తమిళనాడు రాజకీయ పునఃసమీకరణలు జరుగుతాయని ఆమె జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు హింసను ప్రోత్సహించారు, అత్యాచారాలకు పాల్పడ్డారనేది ప్రజలకు తెలుసునని ఆమె అన్నారు. భారతదేశ చరిత్రలోనే ఈ సంఘటనలు అవాంఛనీయమైనవని ఆమె అన్నారు. అహంకారపూరితమైన, నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రజలు అవకాశం కోసం చూస్తున్నారని ఆమె అన్నారు.
Comments
Story first published: Sunday, October 15, 2006, 23:53 [IST]