వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పులిచింతల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే: టిడిపి
విజయవాడ: కృష్ణానదిపై నిర్మిస్తున్న పులిచింతల పనులు నాలుగు శాతం కూడా పూర్తి కాలేదని తెలుగుదేశం నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, దూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. వారు ఆదివారంనాడు పులిచింతల ప్రాజెక్టును సందర్శించారు. కాంట్రాక్టరుకు, ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదం ఇప్పటికీ పరిష్కారం కాలేదని వారు మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఎర్త్డ్యామ్ నిర్మించాలా, కాంక్రీట్ డ్యామ్ నిర్మించాలా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటికీ తేల్చలేదని వారన్నారు. పులిచింతల ప్రాజెక్టు గేట్ల విషయంలోనూ లెక్క తేలలేదని వారన్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం ఏ మాత్రం ముందుకు సాగడం లేదని వారన్నారు.
Comments
Story first published: Sunday, October 15, 2006, 23:53 [IST]