వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వేణుగోపాల్ను తొలగించకూడదు: హైకోర్టు
న్యూఢిల్లీ: విచారణలో ఉండగా అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ పి. వేణుగోపాల్ను పదవి నుంచి తొలగించడం వంటి చర్యలు చేపట్టకూడదని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో పిటిషన్ పెండింగ్లో వుండగా వేణుగోపాలను తొలగించడం వంటి చర్యలు తీసుకుంటే ఎయిమ్స్ కుదరదని అభిప్రాయపడింది.
అయితే బుధవారం జరిగే సమావేశాన్ని పాలక మండలి యధావిధిగా నిర్వహించుకోవచ్చునని తెలియజేసింది. బుధవారంనాటి ఎయిమ్స్ పాలకమండలి కీలక సమావేశంలో వేణుగోపాల్పై వచ్చిన ఆరోపణలపై చర్చ చేయవచ్చునని భావిస్తున్నారు. సంస్థ నిర్వహణలో వైఫల్యాలను, లోపాలను ఈ సమావేశంలో చర్చించే అవకాశం వుంది.
Story first published: Wednesday, October 18, 2006, 23:53 [IST]