వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నబిడ్డనే పొట్టన పెట్టుకున్న తల్లి

By Staff
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: ప్రేమానురాగాలను మర్చిపోయి కన్న కూతురునే పొట్టన పెట్టుకున్న తల్లి ఉదంతం ఖమ్మం జిల్లా దుగినేపల్లి గ్రామంలో జరిగింది. తమ కాపురానికి అడ్డు వస్తోందనే కారణంతో ఆ తల్లి కన్న కూతురుకు బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేసింది. లక్ష్మి, సత్యం దంపతులకు మాధవి అనే కూతురు పుట్టింది. అయితే కొంతకాలానికి సత్యం మరణించాడు. దీంతో లక్ష్మి తిరుమల రావును వివాహమాడింది.

తనకు, తిరుమలరావుకు మధ్య కూతురు అడ్డం వస్తుందని తలపోసిన లక్ష్మి కన్నబిడ్డను హింసించేది. చివరకు పురుగుల మందు తాగించడానికి సిద్ధపడింది. తాను తాగనంటూ కూతురు ఊరి వీధుల వెంబడి పరుగులు తీస్తుంటే వెంటబడి బలవంతంగా తాగించింది. దాంతో ఆ పాప స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆ పాపను ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. ఆ పాప కన్నతల్లి ఘాతుకానికి బలై పరలోకానికి తరలిపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X