వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టెక్ మధును విచారిస్తున్న దర్యాప్తు బృందం?
వరంగల్: రాకెట్ లాంచర్ల కేసులో టెక్ మధును దర్యాప్తు బృందం విచారణ జరుపుతున్నట్లు సమాచారం. మావోయిస్టుల రాకెట్ లాంచర్ల కేసులో టెక్ మధు ప్రధాన నిందితుడు. ఈ కేసులో మరో నిందితురాలైన సుధారాణితో పాటు అతను మంగళవారంనాడే వరంగల్లో పోలీసుల ముందు లొంగిపోయినట్లు ప్రచారం జరిగింది. అయితే అతను గురువారంనాడు పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు గూడూరు బయలుదేరాడు.
తల్లి వెంకటమ్మ, ఒక పోలీసు కానిస్టేబుల్, చర్చి ఫాదర్లతో పాటు మధు గూడూరు పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు బయలుదేరి వెళ్లాడు. మధు మంగళవారంనాడు తల్లి వెంకటమ్మను వరంగల్ జిల్లాలోని కేసముద్రంలో కలిసి తనకు బతకాలని వుందని వేడుకున్నట్లు సమాచారం. దీంతో లొంగుబాటుకు ఆమె ప్రయత్నాలు చేసినట్లు చెబుతున్నారు. టెక్ మధు మంగళవారం రాత్రి హన్మకొండలో రహస్యంగా బస చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
Story first published: Wednesday, October 18, 2006, 23:53 [IST]