వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దళితులకు బాబు క్షమాపణ చెప్పాలి: కోనేరు

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: దళితులను అవమానించే విధంగా ప్రదర్శన నిర్వహించినందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆరా చంద్రబాబు నాయుడు దళితులందరికీ క్షమాపణ చెప్పాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కోనేరు రంగారావు డిమాండ్‌ చేశారు. సోమవారంనాడు విజయవాడలో దళిత ఆత్మగౌరవ ప్రదర్శన నిర్వహిస్తామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. దళితుల ఆత్మగౌరవ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరుగుతుందని ఆయన చెప్పారు. ఏసురత్నం అనే దళితుడికి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి వేషం వేసి చీపుర్లతో కొడుతూ ఇటీవల తెలుగుదేశం పార్టీ విజయవాడలో ప్రదర్శన నిర్వహించింది.

దళితులను అవమానించే విధంగా ప్రదర్శన నిర్వహించిన తెలుగుదేశం పార్టీపై రాష్ట్రపతికి, గవర్నర్‌కు, మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. ఆ ప్రదర్శన నిర్వహించిన తెలుగుదేశం నాయకులపై కేసులు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. దళితుడికి ముఖ్యమంత్రి వేషం వేయించి అసభ్యంగా ప్రవర్తించడం దారుణమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X