వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలమూరు జిల్లాలో ఎమ్మెల్యే సోదరుడి హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట శాసనసభ్యుడు వంశీకృష్ణ సోదరుడు లక్ష్మయ్యను శనివారం అర్ధరాత్రి మావోయిస్టులు కాల్చి చంపారు. ముగ్గురు సాయుధ మావోయిస్టులు ఆదివారం రాత్రి ఆమ్రాబాద్‌ మండలంలోని ఎల్లంపల్లిలో ఆయన నివాసం వద్దనే లక్ష్మయ్యపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో లక్ష్మయ్య అక్కడికక్కడే మరణించాడు.

నల్లమల అడవుల్లో మావోయిస్టులను అంతమొందించామని పోలీసులు ప్రకటించుకున్న నేపథ్యంలో ఈ సంఘటన జరగడం సంచలనం సృష్టించింది. శాసనసభ్యుడి సోదరుడు కావడం వల్లనే లక్ష్మయ్యను మావోయిస్టులు చంపినట్లు చెబుతున్నారు. ఈ సంఘటనతో పోలీసులు గ్రామాన్ని చుట్టిముట్టి మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X