వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కేసులకు భయపడం: టిడిపి
విజయవాడ: కాంగ్రెస్ తమపై పెట్టే కేసులకు భయపడబోమని తెలుగుదేశం పార్టీ గద్దె రామ్మోహన్ రావు స్పష్టం చేశారు. దళితుడితో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వేషం వేయించి అతడ్ని చీపుర్లతో కొడుతూ నిర్వహించిన ప్రదర్శన విషయంలో 27 మంది తెలుగుదేశం పార్టీవారిపై పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులను ప్రస్తావిస్తూ ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తమపై ఏకపక్షంగా కేసులు పెడుతున్నారని, పోలీసులు ఏ మాత్రం పరిశీలించకుండానే తమపై కేసులు పెట్టారని ఆయన అన్నారు. ప్రజలు కాంగ్రెస్వారిని చెప్పులతో కొట్టే రోజులు వస్తాయని ఆయన అన్నారు. తన ఇష్టప్రకారమే తాను ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వేషం వేశానని ముఖ్యమంత్రి వేషం వేసిన దళితుడు ఏసురత్నం అన్నారు. తనకు లేని వ్యతిరేకత కాంగ్రెస్వారికి ఎందుకని ఆయన అడిగారు.
Comments
Story first published: Sunday, October 22, 2006, 23:53 [IST]