వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌, టిడిపిల మధ్య ఘర్షణ: 4గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలు: కర్నూలు జిల్లాలో తెలుగుదేశం, అధికార కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు మధ్య సోమవారం జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు. వీరిలో ఒకరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాగా, ముగ్గురు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు. ఈ సంఘటన కృష్ణగిరి మండలంలోని ఎరుకలచెరువు గ్రామంలో జరిగింది.

పాతకక్షలే ఈ ఘర్షణలకు కారణమని పోలీసులు అంటున్నారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా వుంది. ఇరు పార్టీల కార్యకర్తలు తొలుత పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఆ తర్వాత కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌ (యస్పీ) బి. మల్లారెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి వారు ప్రయత్నిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X