వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్, టిడిపిల మధ్య ఘర్షణ: 4గురు మృతి
కర్నూలు: కర్నూలు జిల్లాలో తెలుగుదేశం, అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య సోమవారం జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు. వీరిలో ఒకరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాగా, ముగ్గురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈ సంఘటన కృష్ణగిరి మండలంలోని ఎరుకలచెరువు గ్రామంలో జరిగింది.
పాతకక్షలే ఈ ఘర్షణలకు కారణమని పోలీసులు అంటున్నారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా వుంది. ఇరు పార్టీల కార్యకర్తలు తొలుత పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఆ తర్వాత కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) బి. మల్లారెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి వారు ప్రయత్నిస్తున్నారు.
Comments
Story first published: Monday, October 23, 2006, 23:53 [IST]