వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చలపతి కమీషన్‌ ముందు కెసిఆర్‌, అశోక్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: చలపతి కమీషన్‌ ముందు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు అశోక్‌ గజపతిరాజు సోమవారంనాడు హాజరయ్యారు. కుప్పం ప్రాజెక్టుపై విచారణకు ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి చలపతి కమీషన్‌ను నియమించింది. ఈ ప్రాజెక్టులో ఒక కంపెనీకి ఉదారంగా నిధులు మంజారు చేశారనే ఆరోపణపై విచారణకు ప్రభుత్వం ఈ కమీషన్‌ను నియమించింది.

కమీషన్‌ ముందు వివరాలు వెల్లడించడానికి చంద్రశేఖరరావు నిరాకరించారు. ఆ ప్రాజెక్టు అమలవుతున్న సందర్భంలో చంద్రశేఖరరావు అప్పటి నారా చంద్రబాబునాయుడి ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా వున్నారు. తనకు కమీషన్‌ సమన్లు జారీ చేయడం అసాధారణమైన విషయమని అశోక్‌ గజపతిరాజు అన్నారు. తాను ఇందులో సాక్షినే తప్ప ముద్దాయిని కాదని ఆయన చెప్పారు. అందువల్ల తెలిసింది చెప్తామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X