తెలంగాణకు కెసిఆర్ వెన్నుపోటు: కెకె
విశాఖపట్నం: తెలంగాణను వెన్నుపోటు పొడవడానికే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పని చేస్తున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు వ్యాఖ్యానించారు. అసలు కరీంనగర్ లోక్సభకు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందని, ఎవరు తెలంగాణకు వ్యతిరేకంగా వున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. తెరాస పుట్టక ముందే తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు వచ్చామని ఆయన చెప్పారు.
కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికలో కెసిఆర్కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే తమపై నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు. ఎన్ని పైసలిస్తే చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారని ఆయన అడిగారు. డబ్బులిచ్చి తెరాసవాళ్లని కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారని అంటూ నాయకులను కించపరచకూడదని ఆయన చంద్రశేఖరరావుకు సలహా ఇచ్చారు. కరీంనగర్ ఉప ఎన్నికలో కెసిఆర్కు రెండో స్థానం వచ్చినా సంతోషమేనని, తెలంగాణను కోరుకుంటున్నారు కాబట్టి కెసిఆర్కు రెండో స్థానమైన రావాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు.