వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అజీజ్రెడ్డి కేసు: చంద్రమౌళిపై కోర్టు వారంటు
హైదరాబాద్: మాఫియా లీడర్ అజీజ్ రెడ్డి కేసులో అసిస్టెంట్ పోలీసు కమీషనర్ (ఎసిపి) చంద్రమౌళిపై నాంపల్లి కోర్టు సోమవారంనాడు నాన్బెయిలెబుల్ వారంటు జారీ చేసింది. విచారణ నిమిత్తం చంద్రమౌళి కోర్టు హాజరు కావాల్సి వుంది. అయితే ఆయన హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. బంజారాహిల్స్లోని అజీజ్ రెడ్డి నివాసంలో అక్రమ ఆయుధాలు లభించడంతో హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సయమంలో చంద్రమౌళి చార్జిషీటు తయారు చేశారు.
అజీజ్రెడ్డిని సోమవారంనాడు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అజీజ్రెడ్డి కేసులో ఇప్పటి వరకు 9 మందిని విచారించారు. ఈ విచారణను నాంపల్లి కోర్టు నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Story first published: Monday, October 23, 2006, 23:53 [IST]