వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిలయన్స్‌ రిఫైనరీలో అగ్నిప్రమాదం: మూసివేత

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ జామ్‌నగర్‌ రిఫైనరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో రైఫనరీని మూసేశారు. పది రోజుల పాటు దీన్ని మూసి వుంచనున్నట్లు సమాచారం. ఈ ప్రమాదం వల్ల ప్రాణనష్టమేమీ సంభవించలేదని కంపెనీ అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే అందర్నీ అక్కడి నుంచి పంపించివేసినట్లు వారు తెలిపారు.

విషయం తెలిసిన వెంటనే ఎమర్జెన్సీ టీమ్స్‌రంగంలోకి దిగాయి. స్పార్క్‌ వల్ల ఈ ప్రమాదం సంభవించి వుంటుందని భావిస్తున్నారు. ఇది జరిగిన సమయంలో దాదాపు 800 మంది ఫ్యాక్టరీలో వున్నారు. ఈ ప్రమాదంలో ప్లాంట్‌ హైడ్రోట్రీటర్‌ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. పెట్రోలియం శుద్ధి చేయడంలో గంధకం తొలగింపునకు దీన్ని వాడుతారు. ఈ ప్రమాదం వల్ల పెట్రోల్‌ కొరత ఏదీ వుండదని ప్రభుత్వం ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X