వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రిలయన్స్ రిఫైనరీలో అగ్నిప్రమాదం: మూసివేత
అహ్మదాబాద్: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జామ్నగర్ రిఫైనరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో రైఫనరీని మూసేశారు. పది రోజుల పాటు దీన్ని మూసి వుంచనున్నట్లు సమాచారం. ఈ ప్రమాదం వల్ల ప్రాణనష్టమేమీ సంభవించలేదని కంపెనీ అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే అందర్నీ అక్కడి నుంచి పంపించివేసినట్లు వారు తెలిపారు.
విషయం తెలిసిన వెంటనే ఎమర్జెన్సీ టీమ్స్రంగంలోకి దిగాయి. స్పార్క్ వల్ల ఈ ప్రమాదం సంభవించి వుంటుందని భావిస్తున్నారు. ఇది జరిగిన సమయంలో దాదాపు 800 మంది ఫ్యాక్టరీలో వున్నారు. ఈ ప్రమాదంలో ప్లాంట్ హైడ్రోట్రీటర్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. పెట్రోలియం శుద్ధి చేయడంలో గంధకం తొలగింపునకు దీన్ని వాడుతారు. ఈ ప్రమాదం వల్ల పెట్రోల్ కొరత ఏదీ వుండదని ప్రభుత్వం ప్రకటించింది.
Comments
Story first published: Wednesday, October 25, 2006, 23:53 [IST]