వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అవుటర్పై హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు
హైదరాబాద్: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురైంది. అవుటర్ రింగ్ రోడ్డుపై తెలుగుదేశం పార్టీ నాయకులు వేసిన పిటిషన్ను కొట్టేయాలని రాష్ట్ర ప్రభుత్వం, హుడా చేసిన అభ్యర్థనను హైకోర్టు గురువారంనాడు త్రోసిపుచ్చింది. అవుటర్ రింగ్ రోడ్డుపై సిబిఐ దర్యాప్తునకు అప్పగించినందున తెలుగుదేశం పార్టీ వేసిన పిటిషన్ను కొట్టేయాలని రాష్ట్ర ప్రభుత్వం, హుడా హైకోర్టును విజ్ఞప్తి చేశాయి. అందుకు హైకోర్టు నిరాకరించింది.
తెలుగుదేశం పార్టీ వేసిన పిటిషన్కు సంబంధించిన కేసులో హైకోర్టు ప్రతివాదులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను నెల రోజులకు వాయిదా వేసింది. హుడా తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి.పి. రావు హైకోర్టులో వకాల్తా పుచ్చుకున్నారు.
Comments
Story first published: Thursday, October 26, 2006, 23:53 [IST]